News March 18, 2024

సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకంటే?

image

ఉత్త‌ర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకునే వారికి రూ.35వేలు అందిస్తోంది. ఇందుకోసం ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే దొంగ పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయానికి వరుడిని తెచ్చుకోకపోవడంతో మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. ఆమెకు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాజ్‌గంజ్‌ అధికారులు షాకయ్యారు.

Similar News

News July 5, 2025

బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

image

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 5, 2025

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

image

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.

News July 5, 2025

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.