News December 28, 2024

మన్మోహన్‌కు స్మారకమా? మరి నా తండ్రికెందుకు అడగలేదు: ప్రణబ్ కుమార్తె

image

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం PM మోదీని ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదన్నారు. కనీసం CWC మీటింగ్ పెట్టి సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా KR నారాయణన్‌కు CWC సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీస్ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

Similar News

News January 21, 2025

రిజిస్టర్డ్ పార్టీకి, రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఇదే

image

అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని <<15218607>>గుర్తింపు పొందిన<<>> రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతోపాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.

News January 21, 2025

అందుకే పనిష్మెంట్ ఇచ్చా: ఈటల

image

TG: తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని బీజేపీ MP ఈటల రాజేందర్ అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు <<15213239>>ఇవాళ పనిష్మెంట్<<>> ఇచ్చానని చెప్పారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు.

News January 21, 2025

BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు

image

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు. 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రాజోలు ఎమ్మెల్యే సీటు గెలిచింది. 2024లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది.