News April 25, 2024
క్రికెటర్ల కోసం మినీ ట్రక్
విండీస్ ప్లేయర్లకు నేపాల్లో దయనీయ స్వాగతం లభించింది. T20 సిరీస్ కోసం కాఠ్మాండూలోని TIA విమానాశ్రయం చేరుకున్న వారికి సరైన స్వాగతం లభించకపోగా అక్కడి నుంచి హోటల్కు వెళ్లేందుకు మినీ ట్రక్లు ఏర్పాటు చేశారు. ప్లేయర్లు ట్రక్లో లగేజ్ పెడుతున్న దృశ్యాలు నేపాల్ క్రికెట్ బోర్డ్ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంటర్నేషనల్ ప్లేయర్లకు కనీస భద్రత, సౌకర్యాలు కల్పించకపోవడం సరికాదన్న విమర్శలొస్తున్నాయి.
Similar News
News January 14, 2025
హరియాణా BJP చీఫ్పై గ్యాంగ్ రేప్ కేసు
హరియాణా BJP చీఫ్ మోహన్ లాల్ బడోలీపై హిమాచల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోటల్లో July 3, 2023న మోహన్ లాల్, సింగర్ రాఖీ మిట్టల్ తనపై అత్యాచారం చేశారని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇస్తానని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.
News January 14, 2025
నేషనల్ పాలిటిక్స్పైనే INDIA ఫోకస్: పవార్
INDIA కూటమి కేవలం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తుందని, అసెంబ్లీ-స్థానిక ఎన్నికలపై కూటమిలో ఎలాంటి చర్చ లేదని NCP SP చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? కలిసి పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన UBT ఇప్పటికే ప్రకటించింది. స్థానిక ఎన్నికలు MVA పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.
News January 14, 2025
అథ్లెట్పై అత్యాచారం.. 44 మంది అరెస్ట్
కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.