News December 8, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

image

బిజీ వేళల్లో వాట్సాప్‌లో అన్ని సందేశాలను చూసుకోవడం వీలు పడదు. దీంతో కొన్నింటిని చూడకుండానే వదిలేస్తాం. ఇలాంటి వాటిని గుర్తు చేసేందుకు మెసేజ్ రిమైండర్ ఫీచర్ రానుంది. ఇది యాప్‌లో చదవకుండా వదిలేసిన సందేశాలను ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అందుబాటులోకి రాగానే సెట్టింగ్స్‌లోని నోటిఫికేషన్‌లో ఉన్న రిమైండర్స్‌ను ఎంచుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు.

Similar News

News January 20, 2025

కల్తీ/నకిలీ పనీర్‌ను ఇలా తెలుసుకోండి..

image

నాన్‌వెజ్‌కు ప్రత్యామ్నాయంగా వాడే పనీర్‌లో నకిలీ/కల్తీ పెరిగాయి. దానిని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. డ్రై పాన్‌పై చిన్న పీస్‌ను వేడి చేయండి. ఒరిజినలైతే కలర్ బ్రౌన్‌గా మారి ముక్క కొంత పొడిపొడిగా అవుతుంది. ఉడికించిన పనీర్‌ను చల్లారబెట్టి ఆ నీటిలో అయోడిన్ చుక్కలు వేయండి. స్టార్చ్ ఉంటే నీరు నీలంగా మారుతుంది. ఇక కందిపొడి వేస్తే పనీర్ రెడ్‌గా మారిందంటే యూరియా, సర్ఫ్ వంటి కెమికల్స్ ఉన్నట్టే.

News January 20, 2025

చంద్రబాబు హయాంలో ఒక్క అప్పడాల మెషిన్ కూడా రాలేదు: YCP

image

చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని ట్వీట్ చేసింది.

News January 20, 2025

బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా

image

రేపు నల్గొండలో BRS చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు, విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈనెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు.