News March 21, 2025
కాళ్లు చచ్చుబడిన వ్యక్తికి AI సాయంతో తిరిగి నడక!

వెన్నెముక గాయంతో రెండేళ్లపాటు మంచం పట్టిన వ్యక్తిని చైనాలోని హువాషాన్ ఆస్పత్రి పరిశోధకులు తిరిగి నడిచేలా చేయగలిగారు. దీనికోసం వారు ఏఐని వాడుకోవడం విశేషం. ఏఐ సాయంతో తాము అభివృద్ధి చేసిన ‘ట్రిపుల్ ఇంటిగ్రేటెడ్ బ్రెయిన్ స్పైన్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ’ని వాడి మెదడుకు, వెన్నెముకకు మధ్య ఎలక్ట్రోడ్లను అమర్చి నరాల బైపాస్ సర్జరీ నిర్వహించామన్నారు. 24 గంటలకే అతడికి కాళ్లు నియంత్రణలోకి వచ్చాయని వివరించారు.
Similar News
News April 21, 2025
రోహిత్ శర్మ అరుదైన రికార్డు

CSKతో జరిగిన మ్యాచ్లో రాణించిన రోహిత్ శర్మ(76*) అరుదైన రికార్డును సాధించారు. IPLలో అత్యధిక(20) POTMలు సాధించిన భారత ప్లేయర్గా నిలిచారు. ఓవరాల్గా ఈ జాబితాలో ABD(25), గేల్(22) తొలి రెండు స్థానాల్లో, కోహ్లీ(19) ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అలాగే IPLలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ధవన్(6,769)ను వెనక్కు నెట్టి 6,786 పరుగులతో హిట్ మ్యాన్ రెండో స్థానానికి చేరారు. కోహ్లీ(8,326) టాప్లో ఉన్నారు.
News April 21, 2025
దేశవ్యాప్త సమ్మెకు LPG డిస్ట్రిబ్యూటర్ల పిలుపు

తమ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించకపోతే దేశవ్యాప్త సమ్మె చేస్తామని LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కేంద్రాన్ని హెచ్చరించింది. నిర్వహణ వ్యయం అధికమైనందున 14.2KG సిలిండర్కు ఇస్తున్న ₹73.03 కమీషన్ను ₹150కి పెంచాలని డిమాండ్ చేసింది. ఉజ్వల స్కీమ్లోని సిలిండర్ల పంపిణీలో సమస్యలున్నాయని, ఆయిల్ కంపెనీల టార్గెట్లనూ భరించలేకపోతున్నామని పేర్కొంది. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపింది.
News April 21, 2025
వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.