News September 24, 2024
నేడు భూమిని సమీపిస్తున్న విమానం సైజు గ్రహశకలం

పల్లీ ఆకారంలోని 2 గ్రహశకలాలు మంగళవారం రాత్రి భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తాయని నాసా జెట్ ప్రొపల్షన్ లెబోరేటరీ తెలిపింది. అందులో ఒకటి విమానం (120 ఫీట్) సైజులో ఉంటుంది. 2024 RO11గా పిలిచే ఇది భూమికి 45.8 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. బస్సు (26 ఫీట్) సైజులో ఉండే 2020 GE శకలం మన గ్రహానికి కేవలం 4.10 లక్షల మైళ్ల దూరం నుంచే వెళ్తుండటం గమనార్హం. ప్రత్యేకమైన టెలిస్కోపులతో వీటిని చూడొచ్చు.
Similar News
News September 15, 2025
సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా కప్లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో UAE ఘన విజయం సాధించడంతో భారత్కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి.
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.