News March 16, 2025
ఎ.ఆర్. రెహమాన్కు ఛాతి నొప్పి, ఆస్పత్రిలో చేరిక

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News April 25, 2025
BREAKING: కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!

నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ సీజ్ ఫైర్ను ఎత్తేశాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
News April 25, 2025
ఉద్రిక్తతల వేళ.. భారీ యుద్ధ విన్యాసం

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్ఫోర్స్ సెంట్రల్ సెక్టార్లో ‘ఆపరేషన్ ఆక్రమణ్’ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్కు చెందిన అగ్రశేణి ఫైటర్ జెట్స్తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. భూఉపరితలంతో పాటు కొండ ప్రాంతాలలో దాడి చేసేలా డ్రిల్ నిర్వహించారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు.
News April 25, 2025
సమ్మర్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బీర్ల సేల్స్

TG: రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. సమ్మర్ సీజన్కు తోడు ఐపీఎల్ ఉండటంతో రోజుకు 3లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. IPL ప్రారంభమైన మార్చి 22వరోజు ఏకంగా 4లక్షల కాటన్ల బీర్లు సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పెరిగిన డిమాండ్ తీర్చడానికి బీర్ సరఫరా సంస్థలు సైతం ఉత్పత్తిని పెంచాయి. లిక్కర్ అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది.