News September 10, 2024
అరుదైన కేసు: కవలలకు జన్మనిచ్చిన బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు

బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 22 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, ఇదొక అరుదైన కేసని వైద్యులు తెలిపారు. ‘మహిళ శరీరంలోని తెల్ల రక్త కణాలు సాధారణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేవి. దీంతో ఆమెకు క్యాన్సర్ మందులు, కీమోథెరపీని సూచించలేదు. విదేశీ నిపుణుల సూచనలతో కడుపులోని బిడ్డలు ప్రభావితం కాకుండా ఔషధాలు అందించడంతో సురక్షితంగా జన్మనిచ్చారు’ అని పేర్కొన్నారు.
Similar News
News July 11, 2025
ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <