News March 22, 2024
ఐకాన్ స్టార్కు అరుదైన గౌరవం

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణకు టైమ్ ఫిక్సయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈనెల 28న రాత్రి 8 గంటలకు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. పుష్ప గెటప్లో ఈ విగ్రహం ఉండనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోలు ప్రభాస్, మహేశ్బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు.
Similar News
News April 17, 2026
ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

ఇరాన్తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.
News April 17, 2026
ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

ఇరాన్తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.
News April 17, 2026
ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.


