News May 3, 2024
YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు. ఇదే కేసులో అవినాశ్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది.
Similar News
News March 7, 2026
ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.
News March 7, 2026
మమతకు నాపై కోపం ఉండొచ్చు.. కానీ: ద్రౌపదీ ముర్ము

WB పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆదివాసీ సదస్సు కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్రపతికి CMతో పాటు అధికారులెవరూ స్వాగతం పలకలేదు. అటు సిలిగుడిలోని సభకు అనుమతి ఇవ్వకుండా వేదికను గోసైన్పూర్కు మార్చడంపై ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ‘మమతకు నాపై కోపం ఉండొచ్చు. కానీ నాకు ద్వేషం లేదు. ఆమె నాకు సోదరి లాంటివారు. ఆదివాసీలు ఏకం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు’ అని అన్నారు.
News March 7, 2026
వేసవిలో దోసకాయలు తింటే?

దోసకాయల్లో 90 శాతం నీరు, పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్, ఫైబర్, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలంలో వీటిని తినడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. రక్తపోటు, బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీల్లో రాళ్లను నివారించవచ్చు. తక్షణ ఎనర్జీ లభిస్తుంది. హానికర టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.
#ShareIt


