News April 11, 2024
‘సున్నా కరెంట్ బిల్లు’ లబ్ధిదారులకు షాక్!

TG: ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్నగర్లో ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు. ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి రూ.809 చెల్లించాలని కొత్త బిల్లు జారీ చేశారు. అయితే.. సాంకేతిక సమస్యతో మార్చిలో సున్నా బిల్లులు జారీ అయ్యాయని డిస్కం అధికారులు చెప్పారు.
Similar News
News November 7, 2025
పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?
News November 7, 2025
బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.
News November 7, 2025
దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం

ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో శివ్ నాడార్(HCL టెక్నాలజీస్) ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708Cr విరాళం ఇచ్చినట్లు ఎడెల్గివ్ హురున్ వెల్లడించింది. గత ఐదేళ్లలో 4సార్లు ఆయన టాప్లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముకేశ్(₹626Cr), బజాజ్(₹446Cr), బిర్లా(₹440Cr), అదానీ(₹386Cr), నందన్(₹365Cr), హిందూజ(₹298Cr), రోహిణి(₹204Cr) ఉన్నారు. మొత్తంగా 191 మంది కుబేరులు ₹10,380Cr ఇచ్చారు.


