News August 27, 2024
యూట్యూబ్ యూజర్లకు షాక్

యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను యూట్యూబ్ పెంచింది. గతంలో రూ.129 ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెల ప్లాన్ ధర ఇప్పుడు రూ.149కి చేరింది. ఫ్యామిలీ ప్రీమియం ధర రూ.189 నుంచి రూ.299కి, ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ రూ.79 నుంచి 89కి పెరిగాయి. ప్రీపెయిడ్తో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది.
Similar News
News April 16, 2026
వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.
News April 16, 2026
మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.


