News October 4, 2024
ట్రాక్టర్ను ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం

ఉత్తర్ప్రదేశ్లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వారణాసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రక్కు ఢీకొన్న తీవ్రతకు ట్రాక్టర్ పక్కకు ఒరిగింది. ట్రాలీ విడిపోయి పక్కనున్న డ్రైనేజీలో బోల్తాపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News December 11, 2025
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: గిద్దలూరు మాజీ MLA పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
News December 11, 2025
భారత్కి సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా: మస్క్

స్టార్లింక్ ద్వారా భారత్కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నానని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్తో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమైన తరువాత మస్క్ ఈ విధంగా స్పందించారు. భారత్లో చివరి మైలు కనెక్టివిటీని శాటిలైట్ ద్వారా విస్తరించే దిశగా చర్చలు జరిగాయని సింధియా ‘X’లో పోస్ట్ చేశారు. డిజిటల్ భారత్ లక్ష్యాలకు శాటిలైట్ టెక్నాలజీ కీలకమని అన్నారు.
News December 11, 2025
రోజ్మేరీ ఆయిల్తో ఎన్నో లాభాలు

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి


