News April 29, 2024
54ఏళ్లుగా ముంపు గ్రామం.. బయటపడింది

ఎల్నినో ప్రభావంతో ఫిలిప్పైన్స్లో కరవు తాండవిస్తోంది. దీంతో అక్కడి జలవనరులు మొత్తం ఎండిపోయాయి. దీంతో దాదాపు 54ఏళ్లుగా నీటిలో మునిగిపోయి ఉన్న న్యువా ఎసిజా ప్రావిన్స్లోని పాత పంటబాంగన్ గ్రామం బయటపడింది. కరవు వల్ల అక్కడి డ్యామ్స్లో సాధారణం కంటే 50మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. మే రెండో వారం వరకూ అక్కడ ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News April 16, 2026
ఖమ్మం: 19న ‘గురుకుల’ ప్రవేశ పరీక్ష

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గిరిజన సంక్షేమ ప్రతిభ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం ఈనెల 19న నిర్వహించే పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని ITDA PO రాహుల్ సూచించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://tgtwrescoe.aptonline.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత సమయంలోగా హాల్ టికెట్లు పొంది, విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు.
News April 16, 2026
తమిళనాడులో TVK విజయ్ మ్యానిఫెస్టో.. పెళ్లికి 8 గ్రా. బంగారం

*60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు నెలకు రూ.2,500
*ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు
*పేదవారి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర
*ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు
*పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తే ఏడాదికి రూ.15వేలు
*ఉన్నత విద్యకు రూ.20 లక్షల వరకు లోన్లు
*రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
*రైతుల పంట రుణాలు మాఫీ
News April 16, 2026
భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.


