News May 10, 2024

ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి హెచ్చరిక

image

ఫాస్ట్‌ఫుడ్స్, చిప్స్, మ్యాగీ, ఇతర స్నాక్ ఐటమ్స్‌ను చాలామంది ఇష్టంగా తింటుంటారు. వీటికి తోడు కూల్‌డ్రింక్స్ తప్పనిసరి అన్నట్లు కొందరు తీసుకుంటారు. కానీ ఇవి మన జీవితకాలాన్ని తగ్గించేస్తున్నాయని తెలుసా? ఉప్పు, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తరచూ తింటే శరీరానికి తగిన పోషకాలు అందవట. దీంతో షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని తాజా పరిశోధనలో తేలింది.

Similar News

News March 17, 2026

ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్లు విడుదల

image

AP: రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం రూ.45 కోట్లను విడుదల చేసింది. 5వేల మంది ఇమామ్‌లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్ల అకౌంట్లలో రూ.15 కోట్లు జమ చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేసింది.

News March 17, 2026

క్లైమాక్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిన హరీశ్ శంకర్!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో విలన్‌ని ఓడించి అంతం చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్‌ను బ్రేక్ చేసి సరికొత్తగా ప్లాన్ చేశాం. సినిమా చివరి వరకు ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు’’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

News March 17, 2026

ఈనెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్

image

భద్రాచలంలో ఈ నెల 27న జరిగే రాములోరి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఉగాది రోజున బ్రహ్మోత్సవ సందడి ప్రారంభం కానుండగా.. అదేరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ దంపతులను నవమి వేడుకలకు ఆహ్వానించనున్నారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో రూ.100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు.