News April 6, 2024

సహజీవనం చేసి విడిపోయినా మహిళకు భరణం ఇవ్వాల్సిందే: హైకోర్టు

image

సహజీవనంలో ఉండే మహిళకు హక్కులను కల్పించే దిశగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకోకుండా పురుషుడితో సహజీవనం చేసి, విడిపోయిన తర్వాత మహిళ భరణం పొందేందుకు అర్హురాలే అని తెలిపింది. వారి మధ్య బంధం రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ఓ మహిళకు నెలకు రూ.1,500 భరణం చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Similar News

News November 22, 2025

రీసర్వే.. అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు: RRR

image

AP: భూముల రీసర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి MRO స్థాయిలో ప్రస్తుతం ఏడాది గడువు ఉంది. దీన్ని రెండేళ్లకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని Dy.స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. 16వేల గ్రామాలకుగాను ఇప్పటికి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. 7 లక్షల అభ్యంతరాలురాగా 2 లక్షల అభ్యంతరాలు పరిష్కారమయ్యాయని చెప్పారు. రీసర్వేను 2027 DECలోగా పారదర్శకంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

News November 22, 2025

BOIలో 115 SO పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74

image

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>