News March 30, 2024
టెర్రరిస్ట్ను ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారిన యూట్యూబర్

అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్ట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారాడు. హైతీకి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్ హైతీకి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసి 6 లక్షల డాలర్లు డిమాండ్ చేసింది. కాగా అడిసన్కు యూట్యూబ్లో 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతడు భయంకర ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు.
Similar News
News December 19, 2025
విచారణకు రాని ఫిరాయింపు MLAల కేసు

ఫిరాయింపు MLAల కేసు SCలో ఈరోజు లిస్టయినా విచారణకు రాలేదు. లంచ్ బ్రేక్ తరువాత వస్తుందనుకున్నా ఇతర కేసులతో విచారణ జరగలేదు. SCకి క్రిస్మస్, శీతాకాలం సెలవులు జనవరి 4వరకు ఉంటాయి. ఆ తరువాత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా సుప్రీం ఇచ్చిన గడువులో స్పీకర్ ఐదుగురు MLAలపై <<18592868>>నిర్ణయం<<>> తీసుకున్నారు. మరో ఐదుగురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసు విచారణకు వచ్చేలోపు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
News December 19, 2025
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.
News December 19, 2025
నాబార్డ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

<


