News March 30, 2024
టెర్రరిస్ట్ను ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారిన యూట్యూబర్

అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్ట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారాడు. హైతీకి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్ హైతీకి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసి 6 లక్షల డాలర్లు డిమాండ్ చేసింది. కాగా అడిసన్కు యూట్యూబ్లో 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతడు భయంకర ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు.
Similar News
News February 4, 2026
ఇవాళ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల భేటీ కొనసాగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
News February 4, 2026
క్రికెట్లో మార్పు.. ఆఖరి ఓవర్లో అవుటైనా..

క్రికెట్ రూల్స్ నిర్ణయించే MCC మరో కీలక మార్పు చేసింది. టెస్టుల్లో ఇంతకుముందు రోజులో చివరి ఓవర్లో ఏదైనా బంతికి బ్యాటర్ అవుటైతే అక్కడే ఆ రోజు ఆట ఆపివేసేవారు. మిగతా బంతులను బౌలర్ తర్వాతి రోజు వేసేవారు. తాజాగా MCC దాన్ని సవరించింది. బ్యాటర్ అవుటైనా ఆఖరి ఓవర్ పూర్తి చేస్తేనే ఆ రోజు ఆట ముగుస్తుందని తెలిపింది. వికెట్ పడగానే మ్యాచ్ను ఆపడం వల్ల ఆటలో డ్రామాను కోల్పోతున్నామని పేర్కొంది.
News February 4, 2026
వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.


