News March 30, 2024

టెర్రరిస్ట్‌ను ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారిన యూట్యూబర్

image

అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్ట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారాడు. హైతీకి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్ హైతీకి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసి 6 లక్షల డాలర్లు డిమాండ్ చేసింది. కాగా అడిసన్‌కు యూట్యూబ్‌లో 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతడు భయంకర ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు.

Similar News

News January 14, 2025

జనవరి 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు

image

రిపబ్లిక్ డే నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి అక్క‌డి ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం విషయాల్లో అన్ని మతాలకు ఉమ్మడి చట్టం అమలు కోసమే UCC తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లివ్-ఇన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న జంట‌లు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవడంతో పాటు సాక్షుల వీడియోల‌ను రికార్డు చేయాల్సి ఉంటుంది. కామన్ పోర్టల్ ఉంటుంది.

News January 14, 2025

మహా కుంభమేళాలో విషాదం

image

మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News January 14, 2025

హ‌రియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు

image

హ‌రియాణా BJP చీఫ్ మోహ‌న్ లాల్ బ‌డోలీపై హిమాచ‌ల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు న‌మోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోట‌ల్‌లో July 3, 2023న మోహ‌న్ లాల్, సింగ‌ర్ రాఖీ మిట్ట‌ల్ తనపై అత్యాచారం చేశార‌ని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని, మ్యూజిక్ వీడియోలో అవ‌కాశం ఇస్తాన‌ని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.