News January 21, 2025
నేటి నుంచి చిన్నారులకు ఆధార్ క్యాంపులు

AP: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 0-6 ఏళ్లు గల చిన్నారుల కోసం ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ నెల 21-24, 27-30 వరకు ఆధార్ నమోదు చేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,06,264 మంది చిన్నారుల్లో 9,80,575 మంది నేటికీ ఆధార్ నమోదు చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. కార్యక్రమం విజయవంతం చేయాలని ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 13, 2025
మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు: RBI

మార్చి 31వ తేదీన దేశంలోని బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మార్చి 31న సెలవు ఇస్తే లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకులు ఆ రోజు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News February 13, 2025
చిరంజీవి మనవడి కామెంట్స్పై SKN ట్వీట్

తనకు ఒక మనవడు కావాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంలో తప్పేముందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మాత SKN దీనిపై ట్వీట్ చేశారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఊరికే అవాకులు చెవాకులు పేలటం, అనవసరంగా రాద్ధాంతం చేసి శునకానందం పొందడం కొందరికి అలవాటు’ అని పేర్కొన్నారు.
News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?

UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.