News February 5, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒప్పుకోని ‘AAP’

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.
Similar News
News March 15, 2025
చిన్న సినిమా.. తొలిరోజే భారీ కలెక్షన్లు

చిన్న సినిమాగా విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇందులో షేర్ దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు కాగా ఫస్ట్ డేనే సగానికి పైగా రికవరీ చేయడం విశేషం. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 15, 2025
హిందీ వివాదం: పవన్ కళ్యాణ్కు DMK MP కనిమొళి కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు TN CM స్టాలిన్ సోదరి, DMK MP కనిమొళి కౌంటర్ ఇచ్చారు. భాషాపరమైన అడ్డంకులు లేకుండా సినిమాలు చూసేందుకు టెక్నాలజీ సాయపడుతుందని పేర్కొన్నారు. గతంలో ‘హిందీ గోబ్యాక్!’ ఆర్టికల్ను షేర్ చేస్తూ పవన్ పెట్టిన ట్వీట్, నిన్న ‘తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు’ అని ప్రశ్నించిన వీడియో స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు. BJPలో చేరక ముందు, చేరాక అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
News March 15, 2025
హైదరాబాద్ నుంచే 50% ఆదాయం!

TG: 2022-23 లెక్కల ప్రకారం రాష్ట్ర జీడీపీలో హైదరాబాద్ వాటా 50.41%గా ఉందని తాజాగా వెల్లడైంది. దీని ప్రకారం మిగతా జిల్లాలు ఆశించినంతగా ఆదాయం తీసుకురావట్లేదని అర్థమవుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక్క నగరం ఇంత సంపద తీసుకురావట్లేదు. ముంబై ఆదాయం 36.3%, బెంగళూరు 40.91%, చెన్నై 31.59%గా ఉంది. మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వికేంద్రీకరణ జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.