News November 22, 2024
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్

Febలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆప్ ప్రభుత్వ సేవలపై చర్చకు ‘రెవ్డీ పర్ చర్చా’ పేరుతో కొత్త కార్యక్రమంతోపాటు 6 గ్యారంటీలు అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఇస్తున్న ఉచిత విద్యుత్, నీరు, చదువు, వైద్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ప్రతి మహిళకు రూ.వెయ్యి, పెద్దవారికి తీర్థయాత్ర యోజన హామీలు ఇచ్చింది.
Similar News
News September 17, 2025
‘అరబ్-ఇస్లామిక్’ NATO.. భారత్కు నష్టమా?

ఖతర్పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్, ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా <<7824953>>NATO<<>> తరహాలో అరబ్-ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉద్ధృతం చేసే ప్రమాదముంది.
News September 17, 2025
ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.
News September 17, 2025
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.