News January 7, 2025
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల

AP: పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం YSR మానసపుత్రిక అయిన సంజీవని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులైనా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని షర్మిల చెప్పారు.
Similar News
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


