News January 7, 2025
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల
AP: పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం YSR మానసపుత్రిక అయిన సంజీవని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులైనా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని షర్మిల చెప్పారు.
Similar News
News January 22, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న అఫ్జల్గంజ్ కాల్పుల దొంగలు
కర్ణాటకలోని బీదర్, HYDలోని అఫ్జల్గంజ్లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్కు, లారీలో ఆదిలాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
News January 22, 2025
టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ICC వార్నింగ్!
టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్నేమ్ పాకిస్థాన్ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
News January 22, 2025
బిల్గేట్స్తో భేటీ కానున్న చంద్రబాబు
AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.