News July 13, 2024

త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు: పొన్నం

image

TG: రద్దీకి అనుగుణంగా వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరో 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. తర్వాత మాట్లాడుతూ.. త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు AC బస్సులు, నియోజకవర్గ కేంద్రాల నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. RTC ఉద్యోగులకు 21% DA ఇచ్చామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News April 17, 2026

సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

News April 17, 2026

తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

image

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.

News April 17, 2026

రాహుల్ గాంధీకి షాక్

image

రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాకిచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించింది. కాగా రాహుల్‌కు బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ 2024లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది నిషేధం.