News March 11, 2025
‘ఆడుదాం ఆంధ్ర’పై ACB విచారణకు ఆదేశం

AP: ‘ఆడుదాం ఆంధ్ర’పై ACB విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలపై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాల్లోని నిధులూ వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ACB విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా RK రోజా బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News March 21, 2025
ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర: మందకృష్ణ

AP: SC వర్గీకరణపై APఅసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణలో CM చంద్రబాబు పాత్ర కీలకమని పేర్కొన్నారు. ‘1997-98లోనే వర్గీకరణపై చంద్రబాబు తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన న్యాయం వైపే ఉన్నారు. జగన్ ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. మోదీ, అమిత్ షా, వెంకయ్య, కిషన్ రెడ్డి, పవన్ అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు.
News March 21, 2025
IPL: కోహ్లీ రికార్డును బ్రేక్ చేయగలరా?

రేపటి నుంచి అతిపెద్ద క్రికెట్ పండుగ IPL మొదలు కానుంది. ఈ టోర్నీలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ గెలుచుకునేదెవరనే దానిపై క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే కోహ్లీపై ఉన్న అత్యధిక రన్స్ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా? అనేదానిపై చర్చ జరుగుతోంది. కోహ్లీ 2016 IPLలో 973 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గిల్ (890), బట్లర్(863), వార్నర్(848) ఉన్నారు. కోహ్లీ రికార్డును ఎవరు బ్రేక్ చేయగలరు? COMMENT?
News March 21, 2025
వామ్మో.. లండన్ కాదు దొంగల డెన్!

లండన్ అనగానే చక్కటి అందాలు మనకు గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా లండన్ చోరీలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన ఏడాది కాలంలో 83వేల ఫోన్లు చోరీకి గురయ్యాయి. లండన్ వీధుల్లో చేతుల్లో ఫోన్ పెట్టుకుని నడిస్తే ఇక ఫోన్ పోయినట్లేనని స్థానికులు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గడచిన వారంరోజుల్లో 230మంది దొంగల్ని అరెస్ట్ చేశారు.