News January 28, 2025

హుస్సేన్ సాగర్‌లో ప్రమాద ఘటన.. ఒకరు మృతి

image

TG: హుస్సేన్ సాగర్‌లో ఇటీవల బోటులో జరిగిన <<15275981>>అగ్నిప్రమాద ఘటనలో<<>> ఓ వ్యక్తి మరణించాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపతి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. గల్లంతైన అజయ్ అనే యువకుడి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ‘భారతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో బాణసంచా కారణంగా అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News February 19, 2025

‘ఉప్పు’ ముప్పును దూరం చేసే టీస్పూన్!

image

ఉప్పు తినడాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్న వేళ జపాన్ సైంటిస్టులు ‘ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్’ను అభివృద్ధి చేశారు. ఏదైనా ఆహారంలో ఉప్పు వేయకున్నా ఆ రుచిని ఈ స్పూన్ మీకు అందిస్తుంది. ఇది తేలికపాటి విద్యుత్ ప్రవాహాన్ని పంపించి నాలుకలో ఉండే టేస్టింగ్ గ్రంథులను ఉత్తేజపరిచి ఉప్పు రుచిని అందిస్తాయి. దీనిని వాడటం వల్ల అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News February 19, 2025

మస్క్: నలుగురితో సంసారం, 13 మంది పిల్లలు

image

అపరకుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఏకంగా 13 మంది పిల్లలకు తండ్రి అని నేషనల్ మీడియా పేర్కొంది. ఆయన నలుగురితో సంసారం చేయగా, వారికి 13 మంది పిల్లలు కలిగినట్లు తెలిపింది. మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు ఉన్నారు.

News February 19, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

image

TG: పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కేసు దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ (మార్చి 3) వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

error: Content is protected !!