News March 25, 2024
సజ్జలపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

AP: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలను పదవి నుంచి తొలగించాలని ఈసీని కోరారు.
Similar News
News October 14, 2025
5 ఛానళ్లను మూసివేస్తున్న MTV

90’s, 2000’sలో సంగీత ప్రియులను అలరించిన TV మ్యూజిక్ ఛానల్ MTV బ్రాడ్ కాస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31కల్లా MTV మ్యూజిక్, 80’s, 90’s, క్లబ్, లైవ్ ఛానళ్లను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఆడియన్స్ యూట్యూబ్, టిక్ టాక్, స్పాటిఫై వంటి ఇతర వేదికలకు మళ్లడంతో ఈ ఛానళ్లకు డిమాండ్ తగ్గినట్లు వెల్లడించింది. అయితే MTV ఛానెల్ మాత్రం ఉంటుందని తెలిపింది.
News October 14, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ NOV 18కి వాయిదా

TG ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. ఫోరెన్సిక్ నిపుణుల ముందు ‘ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్’ చేయాలని ప్రభాకర్ను ఆదేశించింది. కాగా అతడి మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది.
News October 14, 2025
మచాడోకు నోబెల్.. నార్వేలో వెనిజులా ఎంబసీ క్లోజ్

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి రావడాన్ని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో జీర్ణించుకోలేకపోతున్నారు. నార్వేపై ప్రతీకార చర్యలకు దిగారు. అక్కడ తమ ఎంబసీని మూసివేయించారు. ఇందుకు అంతర్గత సర్దుబాటే కారణమని చెప్పారు. మడురో ప్రభుత్వం, ప్రతిపక్షాల వివాదానికి నార్వేనే మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈక్రమంలోనే మచాడోకు నోబెల్ ప్రకటించడం మడురో ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది.