News August 23, 2024

అచ్యుతాపురం సెజ్ ఘటన.. డీజీపీ, సీఎస్‌కు NHRC నోటీసులు

image

AP: అచ్యుతాపురం సెజ్ <<13912550>>ఘటనను<<>> జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. డీజీపీ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టును అడిగింది. గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసింది.

Similar News

News September 17, 2025

ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

image

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అటు TGలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు పడే ఛాన్సుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

News September 17, 2025

ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

TG: HYDలోని ప్రభుత్వరంగ సంస్థ ECIL 160 కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నికల్ ఆఫీసర్-C ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. BE/B.Tech విభాగాల్లో 60% మార్కులు, ఏడాది అనుభవం, 30 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం తొలి ఏడాదిలో నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, 3, నాలుగో ఏడాది రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://ecil.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

News September 17, 2025

రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

image

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT