News August 26, 2024

పళ్లూడిపోయినా నటిస్తున్నారు: రజనీపై DMK మంత్రి విసుర్లు

image

నటుడు రజనీకాంత్‌పై DMK మంత్రి దురైమురుగన్ పంచ్‌లు విసిరారు. ‘నేనూ అదే చెప్తున్నా. పళ్లు ఊడిపోయి, గెడ్డాలు నెరిసి, చివరి దశకు చేరుకున్నా ఇంకా నటిస్తూనే ఉన్నారు. యువ నటులకు అవకాశాలు దొరకనివ్వడమే లేదు. చెప్పడం ఎవరికైనా ఈజీయే’ అని విమర్శించారు. ‘DMKలో పాత విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్లు తరగతి వీడటం లేదు. దురైమురుగన్‌తో వేగడం కరుణానిధికే కష్టమైంది. స్టాలిన్ సర్ మీకు హ్యాట్సాఫ్’ అని రజనీ అన్నారు.

Similar News

News October 17, 2025

3 రోజులు సెలవులు!

image

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News October 17, 2025

రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.

News October 17, 2025

భారత్ మౌనంగా ఉండదు: మోదీ

image

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్‌లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్‌లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.