News April 4, 2025
జింక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసంతో ఒక వన్యప్రాణి బలైందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ HCUలోని అడవిని నరికించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిందన్నారు. చెట్లను తొలగించడంతో ఎటు వెళ్లాలో తెలియక జింక వర్సిటీ పరిధిలోకి వచ్చిందని తద్వారా కుక్కల దాడిలో మృతి చెందిందన్నారు. ఒక వన్య ప్రాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
కేఎల్ ఉంటే ఖేల్ ఖతమే

DC బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్లో ఛేజింగ్ జట్టు గెలిచిన సందర్భాల్లో అత్యధిక యావరేజ్(71.05) కలిగిన ఇండియన్ బ్యాటర్గా నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్(103.70 యావరేజ్) టాప్లో ఉన్నారు. KL 25 ఇన్నింగ్సుల్లో 148.58 స్ట్రైక్ రేటుతో 1,208 రన్స్ చేశారు. ఇందులో 12 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్ మ్యాచ్లలో మొత్తంగా 56 మంది 500+ పరుగులు చేశారు.
News April 11, 2025
నేటి నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 10వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు లాహోర్ ఖలందర్స్తో రావల్పిండిలో తలపడనుంది. వచ్చే నెల 18 వరకు ఈ సీజన్ జరగనుంది. ఆరు జట్లు మొత్తం 34 మ్యాచులాడతాయి. కరాచీ కింగ్స్కు డేవిడ్ వార్నర్ ఆడనుండటం ఈసారి ప్రత్యేకతగా నిలవనుంది.
News April 11, 2025
బీజేపీలోకి విజయసాయి రెడ్డి?

AP: YSRCP, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నానని ప్రకటించిన మాజీ MP విజయసాయి రెడ్డి BJP తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తొలుత టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారన్న టాక్ వినిపించినా.. ఫైనల్గా బీజేపీయే బెటర్ అని నిర్ణయించుకున్నారని సమాచారం. MPగా పెద్దల సభకు పంపిచేందుకు కమలనాథులూ ఓకే అన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.