News June 20, 2024
అవసరమైతే NTAపైనా చర్యలు: కేంద్ర మంత్రి

NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శక పరీక్షల నిర్వహణే తమ లక్ష్యమని, విద్యార్థుల ప్రయోజనం విషయంలో రాజీపడబోమన్నారు. అందుకోసం బాధ్యులైన NTA అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News November 1, 2025
గుడ్న్యూస్.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!

దేశవ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. స్వామిత్వ స్కీమ్లో భాగంగా FY26 చివరికల్లా ప్రాపర్టీ టైటిల్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. APలోని 45లక్షల ఆస్తులకూ హక్కుపత్రాలు అందనున్నాయి. గ్రామాల్లో ఇళ్లు, స్థలాలకు ఆస్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ప్రాపర్టీ టైటిల్తో క్రయవిక్రయాలకు, లోన్లకు వీలు కలగనుంది.
News November 1, 2025
NITCON లిమిటెడ్ 143 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NITCON లిమిటెడ్ 143 డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO), MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. DEO పోస్టులకు స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, MTS పోస్టులకు షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitcon.org/
News November 1, 2025
శనివారం రోజున చేయకూడని పనులు

శనివారం నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకెళ్లడం, కొన్ని పనులు చేయడం అశుభమని భావిస్తారు. అవి..
☞ శనివారం నాడు నువ్వుల నూనె, తోటకూర, చెప్పులు కొనుగోలు చేయకూడదు.
☞ ఉప్పు, నల్ల మినుములను (నల్ల మినప్పప్పు) ఇంటికి తీసుకురావడం శుభదాయకం కాదు.
☞ శనివారం బొగ్గులు, ఇనుము కూడా కొనకపోవడం ఉత్తమం.
☞ ఈ నియమాలు పాటిస్తే శని దేవుని ఆగ్రహం తగ్గుతుందని, అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.


