News March 30, 2024
కమల్ హాసన్ను మించిన నటుడు జగన్: CBN

AP: సీఎం జగన్పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని.. వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్ను మించిన నటుడని.. ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 14, 2025
యూఏఈపై భారత్-ఎ విజయం

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ <<18287840>>టోర్నీలో<<>> భారత్-ఎ బోణీ కొట్టింది. UAEతో జరిగిన తొలి టీ20లో 148 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యం(298)తో బరిలోకి దిగిన యూఏఈ 149 రన్స్కే పరిమితమైంది. ఆ జట్టులో సోహైబ్ ఖాన్(63) ఒక్కడే పోరాడారు. ఇండియన్ బౌలర్లలో గుర్జప్నీత్ 3, హర్ష్ దూబే 2 వికెట్లు తీశారు. భారత్ తన తర్వాతి మ్యాచులో పాకిస్థాన్-ఎతో ఈనెల 16న తలపడనుంది.
News November 14, 2025
ఏపీ ఉక్కురంగంలో జపాన్ పెట్టుబడులు: ఓనో కేయిచ్చి

AP: విశాఖ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న జపాన్ రాయబారి ఓనో కేయిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం కావాలని CM కోరారు. CII సమ్మిట్లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
News November 14, 2025
ఈ నెల 19న రైతుల ఖాతాల్లో PM కిసాన్ డబ్బులు

PM కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న PM మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ <


