News July 31, 2024

కేరళకు అదానీ రూ.5కోట్ల విరాళం

image

ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 163కి చేరింది.

Similar News

News February 2, 2025

విద్యార్థులకు GOOD NEWS.. గడువు పొడిగింపు

image

TG: 2025-26కు గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు <>దరఖాస్తు గడువును<<>> ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితోనే గడువు ముగియగా, ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు 1,46,394దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5, SC, ST గురుకులాల్లో 6-9, TGSWREIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9, TGTWREIS ఖమ్మం, పరిగి SOEలలో 8th క్లాస్‌కు సీట్లను భర్తీ చేస్తారు.

News February 2, 2025

సండే క్రికెట్ ఫీవర్.. నేడు రెండు మ్యాచ్‌లు

image

IND క్రికెట్ అభిమానులకు సండే బొనాంజా. ఇవాళ 2 మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. U-19 ఉమెన్స్ WCలో అజేయంగా అదరగొట్టిన భారత్ నేడు ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. మ.12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మెన్స్ క్రికెట్‌లో ENGపై ఇప్పటికే T20 సిరీస్ కైవసం చేసుకున్న సూర్య సేన నేడు చివరి టీ20లో తలపడనుంది. రా.7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రెండింటినీ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

News February 2, 2025

NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.