News November 24, 2024

మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ

image

AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.

Similar News

News January 25, 2026

గొల్లప్రోలులో డొక్కా సీతమ్మ విగ్రహం తొలగింపు

image

గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ విగ్రహాన్ని అధికారులు ఆదివారం తొలగించారు. 216వ జాతీయ రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం ఉందంటూ నగర పంచాయతీ, పోలీసు అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అనంతరం విగ్రహాన్ని కార్యాలయానికి తరలించి భద్రపరిచారు. ముందస్తు అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

News January 25, 2026

17న ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

AP: వచ్చే నెల 17న రాష్ట్రంలో 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లలు 23 లక్షల మంది ఉన్నారన్నారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని పేర్కొన్నారు.

News January 25, 2026

అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.