News March 5, 2025
అదానీ గ్రూప్ షేర్స్ అదుర్స్.. ఎందుకంటే

$57.16B క్యాపిటల్ ఎక్స్పెండీచర్కు ఫండింగ్ చేసేందుకు $12.5B సమీకరణకు సిద్ధమవుతోందన్న వార్తలతో అదానీ గ్రూప్ షేర్లు నేడు రాణించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10.4, అదానీ ఎనర్జీ 9.7, టోటల్ గ్యాస్ 7.8, విల్మార్ 7.7, NDTV 5.3, పోర్ట్స్ 5.2, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.7, అదానీ పవర్ 4.6, అంబుజా సిమెంట్స్ 3.4, సంఘీ ఇండస్ట్రీస్ 3.2, ఏసీసీ 1.6 శాతం మేర ఎగిశాయి. ఏజెన్సీలు కొన్నిటికి బయ్ రేటింగ్ ఇవ్వడమూ ఇందుకు కారణం.
Similar News
News March 22, 2025
IPL: టాప్లో వీరే..

★ అత్యధిక పరుగులు-కోహ్లీ(8004)
★ అత్యధిక వికెట్లు- చాహల్(205)
★ అత్యధిక సార్లు విజేత-ముంబై, చెన్నై(ఐదేసి సార్లు)
★ అత్యధిక ఫోర్లు- శిఖర్ ధవన్(768)
★ అత్యధిక POTM అవార్డులు- ఏబీ డివిలియర్స్(25)
★ అత్యధిక టీమ్ స్కోరు-SRH(287/3)
★ అత్యధిక సెంచరీలు-కోహ్లీ(8)
★ అత్యధిక అర్ధసెంచరీలు-వార్నర్(66)
News March 22, 2025
ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.