News November 21, 2024
అదానీ స్కాం: ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు!

AP: అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.
Similar News
News November 21, 2025
బ్రెయిన్ స్ట్రోక్కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
News November 21, 2025
బ్రెయిన్ స్ట్రోక్కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
News November 21, 2025
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


