News April 18, 2024
ADB: తోలి రోజు 2 నామినేషన్లు దాఖలు

లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఏడీఆర్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు శ్యామ్ లాల్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ సుభాష్ పాలనాధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
Similar News
News January 3, 2026
నార్నూర్ అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేయాలి: కలెక్టర్

నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా 4వ స్థానం, దక్షిణ భారతదేశంలో 1వ స్థానం సాధించిన నార్నూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డ్ గ్రాంట్ను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. నిధుల వినియోగంపై శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్నూర్ సాధించిన ఈ విజయం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.
News January 2, 2026
జైనథ్: కిసాన్ యాప్ను వెంటనే తొలగించాలి: మాజీ మంత్రి

రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.
News January 2, 2026
ఆదిలాబాద్: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం: ఎస్పీ

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.


