News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 6, 2025
బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

◆నిజాంపట్నం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన◆భట్టిప్రోలు: రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం◆వేటపాలెం: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ◆రేపల్లె: ‘లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిద్దాం’◆బాపట్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమం◆పరీక్షలు బాగా రాశాం: ఇంటర్ విద్యార్థులు◆విలేకరుల పేరుతో బెదిరింపులు.. బాపట్ల సీఐ వార్నింగ్◆గతం గురించి అవసరం లేదు: మాజీ మంత్రి దగ్గుబాటి
News March 6, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబురాలు @ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వోదెల రామకృష్ణ @ మెట్పల్లిలో బీట్ చట్టం రద్దు చేయాలని నిరసన @ షుగర్ ఫ్యాక్టరీపై కోరుట్లలో బీజేపీ నేతల ధర్నా @ సారంగాపూర్ లో ఎండిన పొలం.. కన్నీరు పెట్టుకున్న రైతు @ కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన.
News March 6, 2025
విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్నగర్కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.