News June 2, 2024
బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత?
ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ల రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడైన రెండు రోజుల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.
Similar News
News October 12, 2024
నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్
దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
News October 12, 2024
నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.
News October 12, 2024
పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.