News May 24, 2024
T20 WC బ్రాండ్ అంబాసిడర్గా అఫ్రీది

టీ20 వరల్డ్ కప్-2024 బ్రాండ్ అంబాసిడర్గా పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహీద్ అఫ్రీదిని నియమిస్తున్నట్లు ICC తెలిపింది. ఇప్పటికే యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్లను కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా మరో వారంలో టీ20 WC ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్లో జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడనుంది.
Similar News
News February 7, 2026
ధనప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే?

ధనప్రాప్తి కలగడానికి కొన్ని ఆచారాలు పాటించాలి. రోజూ పూజ చేసే సమయంలో ‘శ్రీ సూక్తం’ పఠించాలి. అమ్మవారిని ఉపాసిస్తూ ఓ లవంగాన్ని ఆమె వద్ద ఉంచడం శుభప్రదం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి శనివారం విరిగిన వస్తువులను పారేసి, బూజు దులపాలి. పూజ గదిలో ‘ఏకాక్షి కొబ్బరికాయ’ ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులను చూసుకుని కళ్లకు అద్దుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
News February 7, 2026
క్రేజీ టైటిల్తో తరుణ్ భాస్కర్ మూవీ

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్కు యూత్లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.
News February 7, 2026
అర్ధరాత్రి బిహార్ ఎంపీ అరెస్ట్

నాటకీయ పరిణామాల నడుమ బిహార్ ఎంపీ పప్పూ యాదవ్(రాజేశ్ రంజన్) అరెస్టయ్యారు. 1995 డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పోలీసులతో అరెస్టుకు వారెంట్ లేదని వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీ నుంచి పాట్నాలోని ఇంటికి చేరిన గంటలోపే పప్పూను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా లోక్సభ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


