News January 22, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న అఫ్జల్గంజ్ కాల్పుల దొంగలు

కర్ణాటకలోని బీదర్, HYDలోని అఫ్జల్గంజ్లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్కు, లారీలో ఆదిలాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News February 15, 2025
14 ఏళ్లకే లక్ష మొక్కలు నాటింది

తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి సింగ్ లక్ష మొక్కలు నాటారు. ‘ప్రసిద్ధి ఫారెస్ట్ ఫౌండేషన్’ స్థాపించి ‘చెట్ల అమ్మాయి’గా ప్రసిద్ధి పొందారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. 110 ప్రాంతాల్లో 1.3 లక్షలకుపైగా వాటిని నాటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అడవుల కోసం ఆమె చేస్తున్న కృషికిగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం PM రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రకటించింది.
News February 15, 2025
గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారు: సీఎం

సంత్ సేవాలాల్ APలో పుట్టినా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని CM చంద్రబాబు కొనియాడారు. సచివాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహాత్మాగాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారని చెప్పారు. బ్రిటీష్ కాలంలో మతమార్పిడులపై పోరాడారని, ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన అప్పుడే బోధించారని పేర్కొన్నారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
News February 15, 2025
టెన్త్ పాసైతే 32,438 ఉద్యోగాలు.. వారం రోజులే ఛాన్స్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ENGతో పాటు తెలుగులోనూ పరీక్ష రాయొచ్చు. <