News May 10, 2024

వారి కాంట్రాక్ట్ తొలగించాలని అగార్కరే చెప్పారు: జైషా

image

BCCI సెక్రటరీ జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తొలగించాలని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కరే నిర్ణయించారన్నారు. కమిటీ నిర్ణయాలను అమలు చేయడమే తన పని అని చెప్పారు. WC తర్వాత రంజీల్లో ఆడాలన్న నిబంధనను శ్రేయస్, ఇషాన్ పట్టించుకోలేదు. దీంతో BCCI వారి కాంట్రాక్టును రద్దు చేసింది. కాగా శాంసన్ వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నామని జైషా తెలిపారు.

Similar News

News March 10, 2026

ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

image

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.

News March 10, 2026

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.

News March 10, 2026

BREAKING: రూ.10వేలు పెరిగిన KG వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.1,48,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.