News April 11, 2024

టీనేజర్ల రక్షణ కోసం ఏఐ: మెటా

image

ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్స్‌టార్షన్/లైంగిక వేధింపులు నుంచి టీనేజర్లకు రక్షణగా ఏఐ టూల్ లాంచ్ చేయనున్నట్లు మెటా వెల్లడించింది. న్యూడిటీ ప్రొటెక్షన్ అనే టూల్‌ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. మెసేజింగ్‌ ద్వారా మైనర్లకు అసభ్యకర ఫొటోలు వస్తే వాటిని గుర్తించి బ్లర్ చేసేలా టూల్‌ను డిజైన్ చేస్తున్నట్లు వివరించింది. దీంతో యూజర్లకు అనవసర కంటెంట్ కనపడదని, వారికి ఆ ఇమేజ్ చూడాలా? వద్దా అనే ఛాయిస్ ఉంటుందని తెలిపింది.

Similar News

News December 14, 2025

అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

image

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్‌గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

News December 13, 2025

అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

image

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.

News December 13, 2025

ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.