News March 23, 2024
ఎన్నికల ప్రచారంలో ఏఐ హవా – 2/2

తమిళనాట దివంగత నేత కరుణానిధిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ఆయనతో DMK ప్రచారం చేసుకుంది. రెండుగా చీలిన AIADMKలో పళనిస్వామి వర్గం తమకే ఓటేయాలని దివంగత నేత, ఆ పార్టీ మాజీ చీఫ్ జయలలితనే దింపింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నేతలపై BJP, ప్రధాని మోదీపై కాంగ్రెస్ డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలను షేర్ చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వాయిస్ క్లోనింగ్తో వారి పేర్లు పలికి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి.
Similar News
News November 4, 2025
నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
News November 4, 2025
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
News November 4, 2025
విశాఖలో భూప్రకంపనలు

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.


