News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Similar News

News February 18, 2026

PHOTO GALLERY: విశాఖలో మిలాన్-2026 రిహార్సల్స్

image

AP: విశాఖ సాగరతీరంలో ఈ సాయంత్రం మిలాన్-2026 రిహార్సల్స్ జరిగాయి. యుద్ధనౌకలు సందడి చేశాయి. 45 భారతీయ నౌకలతో పాటు మొత్తం 71 యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పెద్దఎత్తున విశాఖ ప్రజలు ఈ విన్యాసాలను వీక్షించారు. రేపు మిలాన్-2026 జరగనుంది.

News February 18, 2026

బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

image

బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.

News February 18, 2026

AIతో కొత్త మతాలు.. మిషనరీలు: హరారీ

image

దావోస్‌లో నిఖిల్ కామత్‌తో జరిగిన చర్చలో ప్రముఖ చరిత్రకారుడు యువల్ నోవా హరారీ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో AI కొత్త మతాలను సృష్టించడమే కాకుండా, సొంత మిషనరీలను కూడా కలిగి ఉండొచ్చని అంచనా వేశారు. మతగ్రంథాల సారాంశాన్ని విశ్లేషించడంలో మనుషుల కంటే AI మెరుగ్గా ఉంటుందని తెలిపారు. భక్తుల ప్రశ్నలకు నేరుగా సమాధానమిస్తుందని పేర్కొన్నారు.