News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 9, 2026
చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్కు కీలకమైన ల్యాండింగ్ సైట్ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్ను ప్రయోగించనున్నారు.
News February 9, 2026
వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

లోక్సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.
News February 9, 2026
పాపం.. ఇషాన్ కిషన్!

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.


