News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 2, 2026
మ్యాడ్ సిరీస్లో క్రేజీ యాక్టర్స్!

యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్స్గా హిట్లు అందుకున్న ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సిరీస్లో మూడో సినిమా రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని సినీ వర్గాలు వెల్లడించాయి.
News February 2, 2026
లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోంది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో లా & ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోందని CM CBN విమర్శించారు. తాజా ఘటనలపై ఆయన TDP నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘TTD లడ్డూ వ్యవహారంలో దొరికిపోయిన YCP దాన్ని దారిమళ్లించేందుకు బూతులు ఎత్తుకుంది. TDPని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ది జరుగుతోంది. అన్ని వర్గాలూ సంతోషంగా ఉన్నాయి’ అని వివరించారు.
News February 2, 2026
కుప్పకూలిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి బంగారం ధరలు కుప్పకూలాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఏకంగా రూ.13,410 తగ్గి రూ.1,47,170కి చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.12,300 తగ్గి రూ.1,34,900 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.20వేలు పడిపోయి రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.


