News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 30, 2026
సకుంభ నికుంభుల అంతం ఎలా జరిగిందంటే..?

కుంభకర్ణుడి కొడుకులైన సకుంభ నికుంభులు లోకకంటకులుగా మారి, విభీషణుడి లంకపై దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక విభీషణుడు రాముడిని శరణు వేడాడు. యుద్ధంలో దానవులు యమదండంతో భరత శత్రుఘ్నులను మూర్ఛిల్లజేయగా, రాముడు ఆగ్రహించి వాయవ్యాస్త్రంతో ఆ సోదరులను సంహరించాడు. అనంతరం హనుమంతుడు అమృత కలశాన్ని తెచ్చి రామ సోదరులను పునర్జీవితులను చేశాడు. ఇలా రాముడు విభీషణుడిని ఆపద నుంచి కాపాడి ధర్మాన్ని నిలబెట్టాడు.
News January 30, 2026
‘జనగణమన’లో ఉత్కళ అంటే ఏంటో తెలుసా?

రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం ‘జనగణమన’లో ఉత్కళ అనేది ఇప్పటి ఒడిశా. ఉత్ (ఉత్తమమైన)+ కళ (కళలు)-ఉత్తమమైన కళల భూమి అని అర్థం. కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ్ టెంపుల్, ఒడిస్సీ నృత్యానికి ఆ రాష్ట్రం ప్రసిద్ధి. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు శాంతి మార్గాన్ని ఎంచుకున్నది ఇక్కడేనని చరిత్ర చెబుతోంది. ఉత్కళ అని పలకగానే కళ, చరిత్ర, భక్తి, శాంతి గుర్తురావాలనే ఆ పదాన్ని జాతీయ గీతంలో చేర్చారు.
News January 30, 2026
ECతో మమత కొత్త రగడ

EC SIRను విభేదిస్తున్నWB CM మమత మరో రగడకు తెరతీశారు. పోల్ ప్యానెల్ ప్రకటించిన 15మంది అబ్జర్వర్లలో 9మందిని మార్చాలని ECకి WB లేఖ రాసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 25 మందితో ఆ లిస్టును EC ప్రకటించింది. అందులో WB హోమ్ సెక్రటరీ జగదీశ్ ప్రసాద్, హౌరా, అన్సోల్ CPలు, ఇతర IPSలు ఉన్నారు. వీరికి బదులు వేరే వారిని GOVT ప్రతిపాదించింది. WB స్పందించనందునే సొంతంగా జాబితా ప్రకటించినట్లు EC పేర్కొంటోంది.


