News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Similar News

News December 28, 2025

వెన్నును బలిష్ఠంగా చేసే మేరుదండ ముద్ర

image

మేరుదండ ముద్రను రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపడటంతో పాటు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముందుగా వజ్రాసనం/ సుఖాసనంలో కూర్చోని చేతులను తొడలపై ఉంచాలి. బొటన వేలును నిటారుగా పెట్టి మిగతా నాలుగువేళ్లను మడిచి ఉంచాలి. దీన్ని రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుందంటున్నారు.

News December 28, 2025

వైకుంఠ ద్వార దర్శనంతో ఆరోగ్యం!

image

ఉత్తర ద్వార దర్శనం జ్ఞాన వికాసానికి సూచిక. మన శరీరంలో ఉత్తర భాగంలో ఉండే ‘సహస్రార చక్రం’ ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి, దైవిక జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడమే. ఆలయానికి వెళ్లలేని వారు ఏకాగ్రతతో మనసులోనే ఆ శ్రీహరిని స్మరించుకున్నా సంపూర్ణ ఫలితం దక్కుతుంది. భక్తితో చేసే ఈ దర్శనం మనకు శాశ్వత శాంతిని, మోక్షాన్ని చేకూరుస్తుంది.

News December 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.