News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 10, 2026
రేవంత్ మతం మార్చుకున్నా అభ్యంతరం లేదు: కిషన్ రెడ్డి

TG: ‘కిషన్ రావు’ అంటూ CM రేవంత్ చేసిన <<19085836>>విమర్శలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘నా పేరును మార్చే అధికారం మీకు లేదు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు. మీరు పేరు, మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్తో మీరు కాపురం చేసినన్ని రోజులు మేం నిప్పులు పోస్తాం. KCRకి నేను దత్తపుత్రుడినని విమర్శించారు. నేనెవరికీ దత్తపుత్రుడిని కాదు’ అని ఢిల్లీ ప్రెస్మీట్లో మండిపడ్డారు.
News February 10, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 10, 2026
పెట్టుబడి పరంగా నాకు గోల్డ్ కన్నా బిట్కాయిన్లే బెస్ట్: కియోసాకి

గోల్డ్, బిట్ కాయిన్ పెట్టుబడులకు మంచివేనని, ఒక్క దానినే సెలక్ట్ చేసుకోవాలంటే బిట్ కాయిన్కే తన ప్రయారిటీ అని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చెప్పారు. ‘డిమాండ్ పెరిగితే మైన్స్ నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు. 21మిలియన్ల తర్వాత బిట్ కాయిన్స్ క్రియేట్ చేయలేం. దీర్ఘకాలంలో ధర పెరుగుతుందని నమ్ముతున్నాను. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నుంచి కాపాడే హార్ట్ అసెట్స్కే మద్దతిస్తాను’ అని తెలిపారు.


