News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Similar News

News February 6, 2026

గుడ్ల రైతులకు గడ్డు కాలం

image

AP: రాష్ట్రంలో గుడ్ల రైతులకు గడ్డు కాలం మొదలైంది. <<18548750>>రెండు నెలల<<>> కిందట 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో ₹695 పలకగా ఇప్పుడు ₹480కి పడిపోయింది. గోదావరి నెక్ గుడ్లకు ప్రధాన మార్కెట్ అయిన కోల్‌కతాలో డిమాండ్ లేదంటూ ట్రేడర్లు ₹437కు బేరం ఆడుతున్నారని రైతులు వాపోతున్నారు. 4 రోజులుగా రవాణా నిలిచిపోవడంతో గుడ్లు పేరుకుపోయి పాడవుతున్నాయంటున్నారు. తమకు ఒక్కో గుడ్డు ఉత్పత్తికి ₹5.50 ఖర్చవుతోందని చెబుతున్నారు.

News February 6, 2026

2,325 ఎస్జీటీ పోస్టులు రద్దు!

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో 2,325 సాంక్షన్ ఎస్జీటీ పోస్టుల రద్దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా 2,064 పోస్టుల కోసం పాత సాంక్షన్ పోస్టులను సరెండర్ చేయాలని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 261 HM, 1,803 పీఈటీ పోస్టులు అవసరం ఉండగా క్యాడర్‌ను బట్టి ఉన్న పోస్టులను సరెండర్ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా నల్గొండలో 407, హైదరాబాద్‌లో 306 ఎస్జీటీ పోస్టులు మిగులుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

News February 6, 2026

ఢిల్లీ క్యాపిటల్స్‌కు హార్ట్ బ్రేక్

image

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని నానుడి. DCకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టుకు అన్నిసార్లు పరాభవమే ఎదురైంది. నిన్నటి మ్యాచులో బ్యాటర్లు రాణించినా బౌలర్లు తేలిపోవడంతో ప్రత్యర్థి విజేతగా నిలిచింది. దీంతో WPL ట్రోఫీ గెలిచేందుకు ఆ జట్టుకు మరో సీజన్ వరకు ఎదురుచూపులే మిగిలాయి. IPLలోనూ ఇంతవరకు DC టైటిల్ గెలవకపోవడం తెలిసిందే.