News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Similar News

News February 3, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

image

<>ఇన్‌కమ్ <<>>ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (గుజరాత్) స్పోర్ట్స్ కోటాలో 46 MTS, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో(జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200. వెబ్‌సైట్: https://incometaxgujarat.gov.in

News February 3, 2026

తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు: కిషన్ రెడ్డి

image

TG: దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షకు రెక్కలు తొడిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘TG పురోగతికి వీలుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. PM ఆవాస్ యోజన-అర్బన్ కింద ఇంటికి ₹లక్షన్నర చొప్పున 1.30L ఇళ్లకు ₹2,190Cr, రూరల్ పథకం కింద ఇంటికి ₹72K చొప్పున 3 లక్షల ఇళ్లకు ₹2,160Cr కేంద్రం ఇవ్వనుంది. 5,000KM NHలను నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.

News February 3, 2026

ట్రేడ్ డీల్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ల ధమాకా

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2072 పాయింట్ల లాభంతో 83,739కు చేరగా నిఫ్టీ 639 పాయింట్లు ఎగసి 25,727 వద్ద సెటిల్ అయింది. భారత్-US ట్రేడ్ డీల్‌పై ట్రంప్ ప్రకటన, US టారిఫ్స్ ఇప్పుడు పొరుగు దేశాలకంటే భారత్‌పై తక్కువ ఉండటం, రూపీ విలువ మెరుగవడం, ఆసియా మార్కెట్ల జోరు, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లలో జోష్ నింపాయి. SENSEX 30లో అదానీపోర్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.