News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 29, 2026

రూపాయి పతనం.. వడివడిగా సెంచరీ వైపు

image

రూపాయి మరింత పతనమైంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది. మంగళవారం 91.68గా ఉన్న రూపాయి నిన్న 91.99కి చేరింది. త్వరలోనే ఇది వందకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బంగారం, వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఇవాళ రెండు మెటల్స్ 6శాతం వృద్ధి సాధించాయి.

News January 29, 2026

Oh Sh*t.. పైలట్ల ఆఖరి మాటలు ఇవే

image

బారామతి ఫ్లైట్ క్రాష్‌లో మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ప్రాణాలు కోల్పోయారు. క్రాష్ ల్యాండింగ్‌కి ముందు వాళ్లు మాట్లాడిన ఆఖరి మాటలు కాక్‌పిట్‌‌లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు కొన్ని క్షణాల ముందు ‘Oh Sh*t’ అని కేకలు వేసినట్లు DGCA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

News January 29, 2026

APPLY NOW: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టులు

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ముంబై రీజియన్‌లో స్పోర్ట్స్ కోటాలో 97 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయి, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్‌లో పతకాలు సాధించినవారు అర్హులు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.incometaxmumbai.gov.in