News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 8, 2026
‘లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం’

AP: తిరుపతి(D) పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో “తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2026
జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల బిడ్డకు ఈ సమస్యలు

గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోయి చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలుంటాయి. కార్డియోమయోపతి, స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
News February 8, 2026
NPCIL 30 పోస్టులకు నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<


