News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 31, 2026
28,740 పోస్టులకు నోటిఫికేషన్

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచి FEB 14వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సైట్: https://indiapostgdsonline.gov.in/
News January 31, 2026
రాష్ట్రానికి నిధుల కోసం ఐక్యంగా పోరాడాలి: పొన్నం

TG: తెలంగాణ పుట్టుకనే PM మోదీ అవమానించారని, రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ 11 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారైనా RRR, మెట్రో, ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని కోరారు. విజన్ 2047కు అనుగుణంగా కేంద్రం మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ సహా రాష్ట్ర ఎంపీలతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
News January 31, 2026
కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు నివారణ ఎలా?

ప్రస్తుతం తేమతో కూడిన వాతావరణం వల్ల కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మొక్క నుంచి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి రిడోమిల్ 3 గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంటలో తెలుగు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రిడోమిల్ 3గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


