News December 5, 2024
మిగ్లను కొనసాగించనున్న వాయుసేన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733332850435_1045-normal-WIFI.webp)
మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 18, 2025
ఎంపీతో రింకూ ఎంగేజ్మెంట్లో ట్విస్ట్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737133217999_653-normal-WIFI.webp)
రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.
News January 17, 2025
మహాకుంభమేళాలో శ్రీవారికి గంగా హారతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737132047489_695-normal-WIFI.webp)
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని దశాశ్వమేధ ఘాట్లో తిరుమల శ్రీవారికి గంగా హారతిని అర్చకులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ శ్రీనివాసుడి ప్రతిమను ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.
News January 17, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో మహేశ్ బాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737129528306_653-normal-WIFI.webp)
చాలారోజుల తర్వాత విక్టరీ వెంకటేశ్, ప్రిన్స్ మహేశ్ బాబు ఒకేచోట చేరి సందడి చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ అయింది. అప్పటి నుంచి వెంకీ, మహేశ్ను పెద్దోడు, చిన్నోడు అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో చిన్నోడు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ Xలో పోస్ట్ చేశారు.