News February 2, 2025
ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ

రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.
Similar News
News January 3, 2026
బినామీ ఆస్తుల గుర్తింపునకు AI టూల్: అతుల్ సింగ్

AP: అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. 2025లో ACB 115 కేసులు నమోదు చేసింది. ఇందులోని 69 ట్రాప్ కేసుల్లో 19 రెవెన్యూ విభాగానివే. కాగా ఆదాయానికి మించిన కేసులు 8 ఉన్నాయి. విద్యుత్తు, వైద్య, మున్సిపల్, PR శాఖల ఉద్యోగులపై ఈ కేసులున్నాయి. ఉన్నత, మధ్యస్థాయి అధికారులు బినామీల పేరిట ఆస్తుల్ని కూడబెడుతున్నారు. వాటిని గుర్తించడానికి AI టూల్ను ప్రవేశపెడుతున్నామని ACB DG అతుల్ సింగ్ తెలిపారు.
News January 3, 2026
ఇతిహాసాలు క్విజ్ – 116 సమాధానం

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
సమాధానం: వాల్మీకీ కన్నా ముందు రామాయణాన్ని హనుమంతుడు రాశారని పురాణ గాథలు చెబుతున్నాయి. అది వాల్మీకి రచన కన్నా అద్భుతంగా ఉందని, తన రచనని ఎవరూ చదవరని వాల్మీకీ ఆందోళన చెందాడట. మహర్షి మనస్తాపాన్ని గమనించిన హనుమ, ఏమాత్రం ఆలోచించకుండా తను రాసిన రామాయణాన్ని రచనను చించివేశాడని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 3, 2026
కీలక అంశంపై చర్చ.. ఎవరికి వారే యమునా తీరే!

TG: నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం కీలక చర్చ పెట్టింది. కానీ దీనికి ఒకరోజు ముందే BRS సమావేశాలను బహిష్కరించింది. ఇవాళ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే అధికార కాంగ్రెస్ MLAలే సభలో కూర్చోకుండా లాబీల్లో చక్కర్లు కొట్టారు. దీనిపై స్వయంగా CM రేవంత్ సీరియస్ అయ్యారు. అటు చర్చ సందర్భంగా పలువురు BJP ఎమ్మెల్యేలు సభలో నిద్రపోయారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


