News May 18, 2024

హైదరాబాద్‌లో ఎయిర్ ట్యాక్సీలు?

image

TG: హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ కో ఫౌండర్ శ్రీధర్ దన్నపనేని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలుత ఎమర్జెన్సీ సేవలకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్రి డ్రోన్స్‌తో వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 21, 2025

CRICKET UPDATES

image

* రేపటి నుంచి యాషెస్ సంగ్రామం.. ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం
* ట్రై సిరీస్‌లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. 163 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 95 రన్స్‌కే కుప్పకూలిన లంక
* ఈ నెల 27న WPL వేలం.. తొలి సెట్లో వేలానికి రానున్న దీప్తి శర్మ, రేణుకా సింగ్
* వందో టెస్టులో సెంచరీ బాదిన బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రికార్డ్

News November 21, 2025

నకిలీ ORSలను వెంటనే తొలగించండి: FSSAI

image

ఫుడ్ సేఫ్టీ&స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నకిలీ ORSలపై స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మిస్ లీడింగ్, మోసపూరిత ఎలక్ట్రోలైట్ పానియాలను దుకాణాలు, ఇ-కామర్స్ సైట్ల నుంచి తొలగించాలంది. మార్కెట్లో ORS పేరుతో నకిలీ డ్రింక్స్ చలామణి అవుతున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి WHO గైడ్‌లైన్స్ ప్రకారం ORS స్టాండర్డ్స్‌లో లేనందున అమ్మకానికి ఉంచకుండా చూడాలని కోరింది.

News November 21, 2025

ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

image

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్‌గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్‌ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.