News October 3, 2024
ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం: బాత్రూమ్కు పాకుతూ వెళ్లిన దివ్యాంగుడు

ఎయిర్లైన్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఓ దివ్యాంగుడు బాత్రూమ్కి పాకుతూ వెళ్లిన ఘటన ఇది. ఫ్రాంక్ గార్డెనర్ BBCలో సెక్యూరిటీ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. తాజాగా పోలాండ్ నుంచి లండన్ వెళ్లేందుకు LOT సంస్థకు చెందిన విమానం ఎక్కారు. ప్రయాణంలో బాత్రూమ్కు వెళ్లేందుకు చక్రాల కుర్చీ అడగ్గా సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన పాకుతూనే వెళ్లారు. ట్విటర్లో ఈ విషయాన్ని తెలిపి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 9, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్కు ఇది ఉపయోగపడనుంది.
News December 9, 2025
అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) <<18513734>>వ్యవహారంపై<<>> సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. SIR కొనసాగుతుందని స్పష్టం చేసింది. BLOలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, బెదిరింపులను తమ దృష్టికి తేవాలని ECని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పింది.
News December 9, 2025
ఈ టైమ్లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it


