News November 3, 2024

చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్

image

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించారు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ముంబైలోని వాంఖడేలో అజాజ్ 23 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బోథమ్ (22-వాంఖడే) రికార్డును ఆయన బ్రేక్ చేశారు. వీరిద్దరి తర్వాత రిచీ బెనాడ్ (18-ఈడెన్ గార్డెన్స్), కర్ట్నీ వాల్ష్ (17-వాంఖడే) ఉన్నారు.

Similar News

News November 14, 2025

‘రహేజా’కు భూ కేటాయింపుతో APకి ఏం లాభం? SMలో ప్రశ్నలు

image

AP: విశాఖలో రహేజా సంస్థకు 99 పైసలకే 27 ఎకరాల భూ కేటాయింపును నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారీగా ఉద్యోగాలు కల్పించే TCS లాంటి కంపెనీలకు ఇవ్వడంలో తప్పు లేదు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆస్తిని కొద్దిమంది బలవంతులకు భోజనంగా వడ్డించినట్లు ప్రభుత్వ నిర్ణయం ఉంది తప్ప, APకి ఏ లాభం కన్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

News November 14, 2025

టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

image

కోల్‌కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్‌ను కలిశా. భారత్‌ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.

News November 14, 2025

కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్: తేజస్వీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదింపజేసేందుకు రేపు కుట్ర జరుగుతుందని RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థులు గెలిస్తే ప్రకటించవద్దని, తొలుత ఎన్డీయే అభ్యర్థుల గెలుపునే ప్రకటించాలని అధికారులకు చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఫోన్లు చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.